YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలి

రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలి

మల్కాజ్ గిరి
దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం అయిన మల్కాజ్ గిరి పార్లమెంట్ కు బిఅర్ఎస్ పార్టీ ఎంపి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రాగిడి లక్ష్మారెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పిలుపునిచ్చారు.
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్ విఎం బ్యాంకేట్ హల్ లో బిఆర్ఎస్ కార్యకర్తల, నాయకుల పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మల్లారెడ్డి మాట్లాడుతూకేసిఆర్ తోనే తెలంగాణ దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది... అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యం అయిందని అన్నారు.మల్కాజ్గిరి పార్లమెంటులోని ఏడు శాసనసభ నియోజకవర్గాలలో మొత్తం బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల మేయర్లు, నాయకులు ఉన్నారు. ప్రత్యర్థులకు క్యాడర్ లేదు.గత పది సంవత్సరాల బిఅర్ఎస్ పరిపాలనలో ప్రజలు  ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్నారు. టిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి తన చారిటీ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు అనేక సేవలు అందిస్తున్నారు. కాబట్టి ఇలాంటి నాయకున్ని ఎన్నుకుంటే ప్రజలకు మరింత మేలు చేకూరుతుందని మల్లారెడ్డి కొనియాడారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి గెలిపించి  కేసిఆర్ కేటీఆర్ కి గిఫ్ట్ గా ఇవ్వాలని అన్నారు.ఈ సమావేశంలో పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లు బిఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts