హైదరాబాద్
బి ఆర్ యస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్ పార్టీ లో చేరిన ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి , కూసుకుంట్ల దామోదర్ రెడ్డి ల పై అనర్హత వేటు వేయాలని బి. ఆర్. యస్ శాసన సభాపక్షం తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కి పిటిషన్ సమర్పించింది .జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో ఎమ్మెల్సీలు ఎమ్ యస్ ప్రభాకర్ రావు , యాదవ రెడ్డి , శేరి శుభాష్ రెడ్డి ,బి ఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయ కార్యదర్శి ఎం .రమేష్ రెడ్డి చైర్మన్ ను కలిసి పిటిషన్ తో పాటు పలు ఆధారాలను సమర్పించారు