YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

దోపిడి దొంగలను తరిమికొట్టిన తల్లీకూతుర్లను అభినందించిన కేంద్ర మంత్రి

దోపిడి దొంగలను తరిమికొట్టిన తల్లీకూతుర్లను అభినందించిన కేంద్ర మంత్రి

సికింద్రాబాద్..
బేగంపేటలో దోపిడీకి వచ్చిన దుండగులను చాకచక్యంగా తరిమేసిన ఘటన సమాజానికి స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.  ఇటీవల బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జైన్ కాలనీ లో జరిగిన దోపిడి యత్నం ఘటనలో తల్లి కూతుర్లు చూపిన ధైర్య సాహసాలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభినందించారు. ఈ ఘటనలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన అమిత, భవి లకు కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రశంసా పత్రాలను అందజేశారు. తుపాకీతో బెదిరించి దోపిడీకి యత్నించిన దొంగలను అడ్డుకొని వారిని ప్రతిఘటించి పోరాడిన తల్లి కూతుర్లు మహిళలకు ఆదర్శప్రాయమని అన్నారు. ప్రతి మహిళ విపత్కర సమయాలలో ఆత్మ రక్షణ నిమిత్తం ఎదుర్కొనేందుకు యుద్ధ కళలను నేర్చుకోవాలని అన్నారు. నారి శక్తి సత్తా ఏంటో తల్లి కూతుర్లు నిరూపించారని అన్నారు. విద్యాసంస్థలలో చిన్ననాటి నుండి విద్యార్థినులకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించే విధంగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కోరారు..

Related Posts