చారిత్రక చార్మినార్ వద్ద గురువారం ఉదయం జీహెచ్ఎంసీ, ఎన్.టి.పి.సి అధికారులు ప్లాగింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. చార్మినార్ను స్వచ్ఛ ఐకానిక్గా గుర్తించి స్వచ్ఛ కార్యక్రమాల నిర్వహణకు రూ. 9 కోట్లకు పైగా ఎన్.టి.పి.సి సీఎస్ఆర్ కింద కేటాయించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, సిబ్బంది, ఎన్.టి.పి.సి అధికారులు కలిసి చార్మినార్ వద్ద నేడు ఉదయం ప్లాగింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి పరిసర ప్రాంతాల్లో వ్యర్థాలు, చెత్తచెదారాన్ని తొలగించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ముషారఫ్ అలీ, రవికిరణ్, డిప్యూటి కమిషనర్ అశోక్ సామ్రాట్, మెడికల్ ఆఫీసర్ ఖాద్రిలతో పాటు ఎన్.టి.పి.సి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.