YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు రాబోయే ఐదురోజుల్లో మరింత ఎండల తీవ్రత వాతావరణ శాఖ హెచ్చరిక

తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు రాబోయే ఐదురోజుల్లో మరింత ఎండల తీవ్రత వాతావరణ శాఖ హెచ్చరిక

హైదరాబాద్ మార్చ్ 26
తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రాబోయే ఐదురోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు పెరిగే ఛాన్స్‌ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 27 నుంచి 30 వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం, నిర్మల్‌, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, మహబూబ్‌నగర్‌, నల్గొండ, నారాయణపేట, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది.రాగల ఐదురోజుల పాటు రానున్న ఐదు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదయ్యే ఛాన్స్‌ ఉందని పేర్కొంది. ఇప్పటికే పలు జిల్లాల్లో 42 డిగ్రీలను దాటాయి. రాత్రి పూట 26 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం ఆదిలాబాద్‌ జిల్లా సత్నాల, తలమడుగులో అత్యధికంగా 42.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది టీఎస్‌డీపీఎస్‌ తెలిపింది. చాప్రాలలో 42.1, ఆసిఫాబాద్‌ 42 డిగ్రీలు నమోదవగా.. పలు జిల్లాల్లో 40కిపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని పేర్కొంది.

Related Posts