YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అధిక రక్తపోటుకు కారణమవుతున్న ఉప్పు

అధిక రక్తపోటుకు కారణమవుతున్న ఉప్పు

హైదరాబాదు మార్చ్ 26
ఆహారంలో అన్నీ ఉన్నా..  ఉప్పు లేని లోటు ఎంత చెప్పినా తీరనిది.  ఉప్పు లేని కూర అంటే ఒక ముద్ద కూడా దిగధనే చెప్పాలి.  అలాంటి రుచి కోసం వాడే ఉప్పు ఇప్పుడు ముప్పు తెస్తుంది.  ఏకంగా ప్రాణాలే తీస్తుంది.  అధిక ఉప్పు వాడకం వల్ల రక్తపోటు పెరిగి కిడ్నీ, గుండె, కల్లు లాంటి కీలక అవయవాలు దెబ్బతింటున్నాయి. ప్రధానంగా దీర్ఘకాలిక బిపి వల్ల మూత్రపిండాల వైఫల్యం, గుండెపోటుకు దారితీస్తున్నాయి.  దాంతో డయాలసిస్ అవసరమయ్యే వారి సంఖ్య పెరుగుతుంది.  రాష్ట్రంలో ఏటా కొత్తగా సుమారు 3000 మందికి మూత్రపిండాలు విఫలమవుతున్నాయి.  అందులో 1300 నుంచి 1500 మందికి డయాలసిస్ అవసరం ఏర్పడుతుంది.  ఏటా తెలంగాణ రాష్ట్రంలో రక్త పోటు బాధితుల సంఖ్య పెరుగుతుంది.  రాష్ట్రంలో బీపీతో బాధపడే వారి సంఖ్య ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు ఇటీవల కన్జ్యూమర్ వాయిస్ అనే స్వచ్ఛంద సంస్థ కూడా హెచ్చరించింది.  భారత వైద్య పరిశోధనా మండలి,  ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. పంజాబ్ రాష్ట్రాల్లో నిర్వహించిన ఇండియా హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనీషియేటివ్ సర్వేలో ఈ విషయం వెల్లడయింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతుందంటే...
ప్రపంచవ్యాప్తంగా ఏటా అధిక ఉప్పు వాడటం వల్ల సుమారు 30 లక్షల మరణాలు సంభవిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అధిక ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే ఆ మరణాలు ఆపొచ్చని పేర్కొంది.  అలాగే రోజుకు 2.5 గ్రాముల ఉప్పు,  3.5 గ్రాముల కన్నా తక్కువ పొటాషియం తీసుకోవాలని చెబుతుంది. అంతకుమించి వినియోగిస్తే తీవ్ర రక్త పోటుకు  దారితీస్తుందని హెచ్చరించింది.  ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది రోజుకు 10 నుంచి 12 గ్రాములు ఉప్పును (సిఫారసు చేసిన దాని కంటే రెండింతలు ఎక్కువ) వినియోగిస్తున్నట్లు వెల్లడించింది.  పెద్దలు రోజుకు ఐదు గ్రాములు కన్నా తక్కువ ఉప్పును తీసుకోవడం వల్ల బీపీ, గుండె సంబంధిత జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.  2025 నాటికి ప్రపంచ జనాభాలో ఉప్పు తీసుకోవడాని 30 శాతం  మేర తగ్గించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్య దేశాలు అంగీకరించాయి అని సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి పేర్కొన్నారు.
అధైర్య పడొద్దు:
కిడ్నీ జబ్బులు రాకుండా జాగ్రత్త పడాలి.  వచ్చిన తర్వాత అధైర్య పడొద్దు.  దాన్ని కంట్రోల్ చేసుకుంటూ జీవించాలి. జబ్బును ఎదుర్కోవాలి.  డాక్టర్ల సూచన మేరకు మందులు వాడాలి.  ప్రధానంగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ముఖ్యంగా ఉప్పు వాడకం తగ్గించాలి.  అలాగే కిడ్నీ వ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులతో పాటు ప్రభుత్వ తోడ్పాటు మరియు సమాజ సహకారం ఎంతైనా అవసరం ఉంటుందని అని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి తెలిపారు.

Related Posts