YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

మహిళా న్యాయవాది హత్య అత్యంత దారుణం

మహిళా న్యాయవాది హత్య అత్యంత దారుణం
సభ్యసమాజంలొ మహిళల పట్ల దాడులు పెరిగి పోయాయని న్యాయవాదుల సంఘం అధ్యక్షులు ఆవుల శివరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశాంతతకు పేరుగాంచిన మదనపల్లె పట్టణం లో నడిరోడ్డు పై మహిళా 
న్యాయవాది నాగజ్యోతి అత్యంత దారుణంగా హతమార్చడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టపగలు నడి రోడ్డు పై జనసంచారం ఉండే ప్రాంతంలో కాపు కాసి హతమార్చడం మదనపల్లె న్యాయవాదుల సంఘం 
జీర్ణించుకోలేకపోతోందని జనరల్ సెక్రటరీ శంకర్ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదుల సంఘం ఆద్వర్యంలో గురువారం జరిగిన సమావేశంలో మదనపల్లె న్యాయవాదులు పాల్గొని నాగ జ్యోతి హంతకులకు 
శిక్షపడేవరకు ఉధ్యమిస్తామని అన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులు సంఘం ఆద్వర్యంలో పలు తీర్మానాలు చేశారు. హంతకులను త్వరగా పట్టుకోవాలని పోలీసు అధికారుల దృష్టికి తీసుకుని పోవాలని, నాగజ్యోతి హంతకుల తరపున మదనపల్లె బార్ అసోసియేషన్ ఆద్వర్యంలో ఎవరు వాదించకూడదని, జిల్లాలోని న్యాయవాదులు కూడా వాదించకూడదని కోరుతామని తీర్మానించారు. నాగజ్యోతి ఎంతో సౌమ్యురాలని బార్ 
అసోషియేషన్ మహిళ  ప్రతినిధిగా ఉండేదని అన్నారు. మదనపల్లె డీఎస్పీ కి హంతకులను త్వరగా పట్టు కోవాలని వినతిపత్రం ఇచ్చినట్లు వివరించారు.

Related Posts