YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ప్రతి ఒక్కరు ఓటు వేయాలి

ప్రతి ఒక్కరు ఓటు వేయాలి

వికారాబాద్
ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి  అన్నారు. బుధవారం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు  ఐ ఓట్ ఫర్ ష్యూర్   నినాదంతో వికారాబాద్   పట్టణంలో ఎన్నెపల్లి చౌరస్తా నుండి అలం పల్లి చౌరస్తా వరకు ఏర్పాటు చేసిన 5కే రన్ కార్యక్రమాన్ని  జిల్లా ఎస్పీ కోటి రెడ్డి , అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి జెండా ఊపి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఐ ఓట్ ఫర్ ష్యూర్ మే 13 న జరిగే  పార్లమెంటు ఎన్నికల కోసం ఓటర్ కార్డులు సవరణ కేంద్రాలు ఏర్పాటుచేయడం జరుగుతుందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తప్పక ఓటరుగా తమ పేర్లు నమోదుచేసుకోవాలన్నారు.ఇందుకు గాను  ప్రత్యేక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకుని ఓటు హక్కు వినియోగించు కోవాలన్నారు.18సంవత్సరాలు  నిండిన ప్రతి ఒక్కరు  ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు.ఈ కార్యక్రమములో స్వీప్ నోడల్ అధికారి ఏం.ఎ సత్తార్ , డి ఎస్ పిశ్రీనివాస్ రెడ్డి,  జిల్లా అధికారులు , వివిధ శాఖల ఉద్యోగులు  , అన్ని కళాశాల ల విద్యార్థిని , విద్యార్థులు , తదితరులు పాల్గొన్నారు.

Related Posts