రెడ్ క్రాస్ సొసైటీ ( మహబూబ్ నగర్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనరిక్ మందుల షాప్ ను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్ గౌడ్ జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలలో పేద ప్రజలు వైద్యం చేసుకుంటారు. అందుకుగాను ప్రభుత్వ సహాయంతో (50% నుండి 80% వరకు రాయితీపై) తక్కువ ఖర్చుతో పేదవారికి మందులు అందించాలనే ఉద్దేశంతో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాధ అమర్, వైస్ చైర్మన్ రాములు, రెడ్ క్రాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదన్ మోహన్ రావు, నట రాజు, జగపతి రావు, బెక్కం జనార్దన్, ఖాజా మొయినుద్దీన్, రామ్ కిషన్, ప్రతిభ, మంజుల, విష్ణు జనార్దన్, రామ్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.