YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బండి సంజయ్ ధర్నాలు, దీక్షలు మానుకోవాలి మంత్రి పొన్నం

బండి సంజయ్ ధర్నాలు, దీక్షలు మానుకోవాలి మంత్రి పొన్నం

హుస్నాబాద్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా  చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 5 సంవత్సరాలు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడి గా పట్టించుకోని బండి సంజయ్ కి ఇప్పుడు రైతులు గుర్తొచ్చింది . ఈ దీక్ష ఢిల్లీ వెళ్లి నరేంద్ర మోడీ దగ్గర చేయాలి. వర్షాలు లేవు కరువు వచ్చింది.. రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం దగ్గర బండి సంజయ్ అడగాలి. రైతుల దగ్గర బండి సంజయ్ మొసలి కన్నీరు కారుస్తున్నారు . కాళేశ్వరం మునిగితే కేసిఆర్ ఎక్కడికి పోయావు. ఈరోజు రైతుల పొలాల దగ్గర రాజకీయం చేస్తున్నావు.  ధర్నాల దీక్ష లే పేరుతో రాజకీయం మానుకోవాలని అన్నారు.

Related Posts