YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ లో ఐదుగురు ఐపీయస్ అధికారులపై బదిలీ వేటు

ఆంధ్రప్రదేశ్ లో ఐదుగురు ఐపీయస్ అధికారులపై  బదిలీ వేటు

విజయవాడ
రాష్ట్రంలో ఐదుగురు ఐసీఎస్ అధికారలను కేంద్ర ఎన్నికల కమీషన్ బదిలీ చేసింది.  ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు ఎస్పీలపై బదిలీ వేటుపడింది.   ⁠వీరిని వెంటనే బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. ⁠ఎన్నికలతో సంబంధం లేని పోస్టుల్లోకి బదిలీ చేయాలని రాష్ట్ర సీఇఓ కు ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల కమీషన్ ఆదేశాలను ఛీఫ్ సెక్రటరీ, డీజీపికి సీఇవో  పంపారుర. ⁠ఆయా జిల్లాల ఎస్పీల పోస్టులకు ప్యానల్ పంపాలని ఆదేశాలు ఇచ్చారు. ⁠చిత్తూరు ఎస్పీ జాషువా, ప్రకాశం ఎస్పీ పరమేశ్వరరెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, అనంతపురం ఎస్పీ అంబురాజన్ పై వేటు పడింది. ⁠రాష్ట్ర సీఇఓ ఇచ్చిన నివేదిక, ప్రతిపక్షాల ఫిర్యాదు మేరకు ఎస్పీలపై బదిలీ వేటు పడినట్లు సమాచారం.

Related Posts