YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పెద్దపల్లిలో గడ్డం వంశీని గెలిపించాలి

పెద్దపల్లిలో గడ్డం వంశీని గెలిపించాలి

సికింద్రాబాద్
కాకా వెంకటస్వామి ని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి వస్తున్న విద్యావంతుడు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీని ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రి శ్రీదర్ బాబు ప్రజలకు పిలుపునిచ్చారు.
సికింద్రాబాద్ బేగంపేట్ ప్రకాష్ నగర్ లోని ఎమ్మెల్యే  ప్రేమ్ సాగర్ నివాసంలో వంశీకి మద్దతుగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు వినోద్, వివేక్, రాజ్ ఠాకూర్, విజయ రామారావు, అడ్లూరి లక్ష్మన్ తో కలసి మంత్రి శ్రీదర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా శ్రీదర్ బాబు మాట్లాడుతూ పెద్దపల్లి లో వంశీ కి అందరు తెలుసని, అనేక సేవాకార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు తెలిపారు. యువతకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే యువతకు  వంశీకి టికెట్ ఇచ్చారని తెలిపారు.  వంశీకి ఏఐసీసీ కి పూర్తి సపోర్ట్ వుందని పేర్కొన్నారు.  వర్షాలు పడే సమయంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉందన్నే విషయాన్ని మరచి  కాంగ్రెస్ ప్రభుత్వమే కరువు తెచ్చిందని కేసీఆర్ సిగ్గు చేటని అన్నారు. కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే ఇలాంటి చవకబారు ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో 10నుండి 14 సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని అనేక నివేదికలు చెబుతున్నాయని అన్నారు.

Related Posts