YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నీటి ఎద్దడి పై దృష్టి సారించండి -కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

నీటి ఎద్దడి పై దృష్టి సారించండి -కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్
మహానగరంవ్యాప్తంగా నెలకొన్న నీటి ఎద్దడి పై దృష్టి సారించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర సర్కార్ కు సూచించారు. గురువారం రాత్రి సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని లోద అపార్ట్మెంట్లో ఆయన అపార్ట్మెంట్ వాసులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలో మంచి నీటి సమస్య తీవ్రంగా ఉందని అన్నారు. నీటి సరఫరా లో పంతో బస్తీలు కాలనీలలో సైతం మంచినీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రస్తుతం వేసవి ప్రారంభంలోనే ఈ పరిస్థితి ఉంటే ఏప్రిల్ మాసం మొత్తం మే జూన్ వరకు పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే ప్రమాదం ఉందని అన్నారు.  తెలంగాణ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలో  ప్రజలను బెదిరించి భయపెట్టి డబ్బులు వసూలు చేసి పార్లమెంట్ ఎన్నికల కోసం ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీకి పంపిస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఖ్యాతి గడించిన హైదరాబాద్ మహానగరంలో నీటి సమస్య లేకుండా చూడాలని అన్నారు.

Related Posts