YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వాహనాల తనిఖీల్లో 4,73,500/- రూపాయలు సీజ్

వాహనాల  తనిఖీల్లో  4,73,500/- రూపాయలు  సీజ్

గద్వాల
లోక్ సభ ఎన్నికల కోడ్ లో బాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ ల పరిధిలో, సరి హద్దు చెక్ పోస్టు లలో పోలీస్ అధికారులు విస్తృతంగా  వాహనాల తనిఖీలు చేపట్టి 4,73,500/- రూపాయలను సీజ్ చేసి  జిల్లా ఎన్నికల గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటి కి అప్పగించినట్లు జిల్లా ఎస్పీ శ్రీమతి రితిరాజ్ తెలిపారు.గురువారం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో గట్టు పోలీస్ స్టేషన్  పరిధిలో ఏలాంటి రశీదులు లేని 2,76,000/- రూపాయలను ఉండవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుల్లూరు  చెక్ పోస్టు నందు 1,97,500/-  రూపాయలను సీజ్ (మొత్తం 4,73,500/- రూపాయలు) చేసి జిల్లా ఎన్నికల గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీకి పోలీస్ అధికారులు అప్పగించినట్లు ఎస్పీ గారు తెలిపారు.ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జోగుళాంబ గద్వాల్ జిల్లా పరిధిలో ఎవరైన 50 వేల రూపాయల కొద్దీ ఎక్కువ డబ్బులను తీసుకువెళ్లరాదని ఒక వేళ తీసుకెళ్తే  తగిన రశీదులు ,పత్రాలు  వాటి వివరాలు వెంట తీసుకెళ్ళాలని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు.

Related Posts