హైదరాబాద్, ఏప్రిల్ 6
హైదరాబాద్లోని కంటోన్మెంట్కు ఈ ఎన్నికలతోనే ఉపఎన్నిక జరగనుంది. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత విజయం సాధించారు. అయితే రెండు నెలల క్రితం ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో అక్కడ ఉపఎన్నికల అనివార్యమైంది. ఇది ఏకగ్రీవం అవుతుందని అనుకుంటున్నటైంలో కాంగ్రెస్ పోటీకి సిద్ధమైంది. అక్కడ తమ పార్టీ అభ్యర్థిగా శ్రీగణేష్ను ప్రకటించింది. ఆయన గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేశారు. లాస్యపై ఓడిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ఆయనకు టికెట్ ఇచ్చింది.