సికింద్రాబాద్
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రచారం మల్కాజిగిరిలో జోరందుకుంది. మల్కాజిగిరి నియోజకవర్గం లోని దీన్ దయాల్ నగర్ లో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ విగ్రహానికి బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ పూలమాలవేసి నివాళులర్పించారు, కాలనీ వాసుల సమావేశంలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలోని పలుచోట్ల భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో బిజెపి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, బిజెపి నేతలు పాల్గొన్నారు.