YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఒక యువ నేత అరంగేట్రం

ఒక  యువ నేత అరంగేట్రం

పెద్దపల్లి
తెలంగాణ రాష్ట్రంలోనే అందరి దృష్టి పెద్దపల్లి పార్లమెంట్ పైనే ఉంది. ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులు ముగ్గురు ఉద్దండులే. ఇందులో కాంగ్రెస్  యువ నేత గడ్డం వెంకటస్వామి మనుమడు మాజీ ఎంపీ చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణ అలాగే బి ఆర్ ఎస్ నుండి ఆరుసార్లు రామగుండం మరియు ధర్మపురి నుండి ఎన్నికై బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో చీఫ్ విప్,  రాష్ట్ర మంత్రిగా చేసిన కోపుల ఈశ్వర్ అలాగే 2009 సంవత్సరంలో అప్పటి టిఆర్ఎస్ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి చేతిలో ఓడిపోయిన ప్రస్తుతం బిజెపి అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ పోటీలో నిలుస్తున్నాడు.
పెద్దపల్లి పార్లమెంట్లో త్రిముఖ పోరు సాగుతోంది. గత ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ నుండి గెలిచిన బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీ లో చేరారు. దీంతో ఇక్కడ మాజీమంత్రి కొప్పులకు బిఆర్ఎస్ టిక్కెట్ కేటాయించింది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే వివేక తనయుడు గడ్డం వంశీకృష్ణ బరిలో ఉన్నారు. సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారంలో వేడి అందుకుంది. గెలుపుపై ఎవరిధీమా వారు వ్యకం చేసుకుంటూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అందరూ కాంగ్రెస్ ఎంఎల్ఎలే ఉన్నారు. అయినప్పటికీ అక్కడ హోరాహోరీ పోరు కొనసాగనుంది. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, బిఆర్ఎస్ నుండి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బిజెపి నుండి గోమాస శ్రీనివాస్ బరిలో నిలిచారు. వంశీకృష్ణ రాజకీయ కుటుంబం నుండి వచ్చినప్పటికీ బరిలో నిలిచిన ప్రధాన పార్టీల వారితో పోల్చితే రాజకీయ అనుభవం మాత్రం తక్కువే. ప్రధాని మోడీ చేసిన అభివృద్ధిని కళ్ళముందే కనబడుతోందని, అందులో భాగమే ఎరువుల ఫ్యాక్టరీ అని చెప్పుకుంటూ బిజెపి అభ్యర్థి గోమాస శ్రీనివాస్ తన ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఈ ఎన్నికలలో అధికార భరోసా ఒకరిది, సెంట్ మెంట్పై మరొకరు, సానుభూతి పవనాలపై ఇంకొకరు గెలుస్తామంటూ ఎవరి ధీమా వారే వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉంది మా పార్టే.. అందరి అండదండలతో ' భారీ మెజార్టీతో గెలిచి తీరుతా'నని కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నారు. మాలలకే కాంగ్రెస్ పెద్దపీట వేస్తుందని .. పెద్దపల్లి సీటు మార్చి మాదిగలకు ఇవ్వాలని ఇటీవలే ధర్నా చేశారు. లేకుంటే మాదిగల ఓట్లు కాంగ్రెస్కు పడవని అధిష్ఠానానికి తేల్చిచెప్పారు. మరోవైపు మంత్రి శ్రీధర్ బాబు, వంశీ కృష్ణను అందరి సహకారంతో మంచి మెజార్టీతో  గెలిపించుకుంటామని అంటున్నారు. అలాగే గతంలో వంశీకృష్ణ తాత వెంకట స్వామి హయాంలో ఎందరికో ఉపాధి కల్పించారు. పెద్దపల్లి పార్లమెంట్లో కాక ఫ్యామిలీకి మంచి పట్టు ఉంది ప్రతి ఒక్కరితో సంబంధాలు కలిగిన గడ్డం కుటుంబం ఈసారి ఎలాగైనా వంశీకృష్ణ ను గెలిపించాలని దృక్పథంతో ఉన్నారు. బిఆర్ఎస్ నుండి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బరిలో నిలిచారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి చెందారు. కార్మిక లీడర్ అయినా.. ఈశ్వర్కు పెద్దపల్లి జిల్లాపై మంచి పట్టున్న.. పట్టుకొని ఉంటున్న వ్యక్తిగా పేరుంది. కోల్ బెల్ట్ ఏరియాలో అందరివాడుగా ముద్రపడిన మంచి రాజకీయ నేత.. ఎవరి మనసు నొప్పించకుండా మెప్పించేవారని ఆ ప్రాంత ప్రజల్లో పేరుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారని ఆయనపై సానుభూతి పవనాలు వీస్తున్నాయని అందరి నోటా అదే మాట. బొగ్గు గణీని ప్రాంతాలైన గోదావరిఖని, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూర్ సెగ్మెంట్లలో కార్మిక లోకమంతా ఈశ్వర్ కు మద్దతుగా నిలుస్తుందని, ధర్మపురిలో కూడా పూర్తిగా సానుభూతి ఉ  ంటుందని రాజీకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకే కుటుంబంలో ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు ఎమ్మెల్యేలుగా ఉన్నారని, తనకు ఎంపిగా అవకాశం ఇవ్వాలని కొప్పుల ప్రచారాస్త్రంగా మలిచి ముమ్మరంగా తిరుగుతున్నారు. బిజెపి అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గతంలో పెద్దపల్లి పార్లమెంట్ నుండి పోటీపడ్డారు. దేశంలో మోడీ గాలీ వీస్తోందని ధీమాతో ఉన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రజలతో మమేకం అవుతూనే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ముందుకు సాగుతున్నారు. రానున్న రోజుల్లో ప్రజలే ఓటర్లు నిర్ణయిస్తారు ఎవరిని ఢిల్లీకి పంపుతారో వేచి చూడాల్సిందే.

Related Posts