YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఒక్కో వ్యూహం... ఒక్కో నియోజకవర్గం

ఒక్కో వ్యూహం... ఒక్కో నియోజకవర్గం

హైదరాబాద్, ఏప్రిల్ 8
రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో కనీసం 14 స్థానాల్లోనైనా విజయం సాధించాలనే పట్టుదల తో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఉంది. పక్కా ప్రణాళికతో, ఆచరణాత్మకమైన వ్యూహాలు, స్థానిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని ఎప్పటి కప్పుడు రాజకీయపరమైన వ్యూహాలు మార్చుకొంటూ నిర్దేశించుకొన్న లక్షాలన్నిసాధించాలన్న పట్టుదలతో ఉంది. ఆ దిశ గా నాయకులు, కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోని స్థానిక పరిస్థితులను నేతల నుంచి అడిగి తెలుసుకొని అప్పటికప్పుడు వ్యూహరచన చేస్తూ కేడర్‌కు దిశానిర్ధేశం చేస్తూ ముఖ్యమంత్రి, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో కసరత్తులు చేస్తున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ప్రత్యర్ధి పార్టీల్లో ఉన్న నాయకులు, వారి వ్యవహారశైలి, అసంతృప్తి నేతలు, బి ఆర్‌ఎస్, బిజెపి నేతల బలం, బలహీనతలను తెలుసుకొని నియోజకవర్గాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా అనుసరించాల్సిన రాజకీయపరమైన ఎత్తులు, పైఎత్తులపై పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని సీ నియర్ నాయకులు, కేడర్‌తో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.అంతేగాక లోక్‌సభ సెగ్మెంట్‌లలోని సామాజికాంశాలు, ఏ యే సామాజిక వర్గంలో ఏ పార్టీ వైపు ఉంది, ఏయే సామాజిక వర్గం రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంటుందో కూడా తెలుసుకొని వారందరినీ కాంగ్రెస్ పార్టీకి, హస్తం గుర్తుకు ఓటు వేసే విధంగా అనుసరించాల్సిన విధివిధానాలపై సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్ధేశం చేస్తున్నారని కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వివరించారు. అందులో భాగంగానే ఆదివారం సికింద్రాబాద్, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ నాయకులతో సిఎం రేవంత్‌రెడ్డి వేర్వేరుగా సమావేశమయ్యారు. అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని ముఖ్యమంత్రి ఈ రెండు నియోజకవర్గ నాయకులకు దిశానిర్ధేశం చేశారు.సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలం ఈ మూడునెలల్లో పెరిగిందని, అసెంబ్లీ ఎన్నికల కంటే ప్రస్తుతం కేడర్ బలంగా తయారయ్యిందని దీనిని నాయకులంతా సద్వినియోగం చేసుకోవాలని సిఎం రేవంత్ ఆ నియోజకవర్గ నాయకులతో పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో 14 ఎంపి స్థానాలు తగ్గకుండా మనం గెలుచుకోవాలని ఆ దిశగా కార్యకర్తలు, నాయకులను సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని సిఎం రేవంత్ పిలుపునిచ్చారు. అయితే సికింద్రాబాద్ అభ్యర్థిగా ఇప్పటికే దానం నాగేందర్‌ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించగా ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేయాలన్న కండీషన్‌ను విధించినట్టుగా తెలిసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేయడానికి సుముఖత వ్యక్తం చేయడంతో ఆయన్ను అభ్యర్థిగా మార్చుతారా లేదా అన్నది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది సికింద్రాబాద్ నియోజకవర్గ సమావేశంలో దానం నాగేందర్ కూడా హాజరుకావడంతో అభ్యర్థి మార్పుపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ సమావేశంలో మాత్రం సికింద్రాబాద్ ఎంపి అభ్యర్థి మార్పు ఉండదని నియోజకవర్గ నేతలతో సిఎం రేవంత్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థులు హాజరుకావడంతో ఈసారి కచ్చితంగా ఓడిపోయిన స్థానాల్లోనూ కాంగ్రెస్ ఓటు బ్యాంకు కచ్చితంగా సికింద్రాబాద్ ఎంపి అభ్యర్థికే పడేలా కృషి చేయాలని సిఎం రేవంత్ ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థులకు సూచించినట్టుగా తెలిసింది. జూబ్లీహిల్స్ నుంచి పోటీచేసిన అజారుద్దీన్, నాంపల్లి నుంచి పోటీ చేసిన ఫిరోజ్‌ఖాన్, సనత్‌నగర్ ఎమ్మెల్యే అభ్యర్థితో పాటు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మీలు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Related Posts