సికింద్రాబాద్..
రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మహంకాళి ఏ సి పి సర్దార్ సింగ్ తెలిపారు.. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్తన్ కాంపౌండ్ పరిసర ప్రాంతాలలో వందమంది పోలీసు సిబ్బంది నిర్బంధ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. మహంకాళి ఏసిపి, ముగ్గురు ఇన్స్పెక్టర్లు, పదిమంది ఎస్ఐలతో పాటు వందమంది పోలీసు సిబ్బందితో నిర్బంధ తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలతో పాటు నిషేధిత గుట్కా ఓ రౌడీ షీటర్ ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి సమాచారం అయినా పోలీసులకు అందజేయాలని తెలిపారు.