YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ వైఎస్సార్ వారసుడు కానే కాదు - వైఎస్ షర్మిలా రెడ్డి

జగన్ వైఎస్సార్ వారసుడు కానే కాదు  - వైఎస్ షర్మిలా రెడ్డి

కడప
కడప జిల్లా మైదుకూరు నియోజక వర్గం బ్రహ్మం గారి మఠం మండల కేంద్రంలో బహిరంగ సభ లో ఏపీసీసీ ఛీఫ్, కడప పార్లమెంట్ అభ్యర్దిని షర్మిలా రెడ్డి  మాట్లాడారు. జగన్ వైఎస్సార్ వారసుడు కానే కాదు. వైఎస్సార్ పాలన కు జగన్ పాలన కు పొంతనే లేదు. బూతద్దం పెట్టీ చూసినా వైఎస్ పాలన ఆనవాళ్లు కూడా కనపడవు. జగన్ పాలన హత్యా రాజకీయాలు చేసే పాలన. సొంత బాబాయిని చంపిన నిందితులను కాపాడుతున్న పాలన అని అన్నారు.
వైఎస్సార్ వారసుడుగా జగన్ ఆయన ఆశయాలు నిలబెడతారు అనుకున్నాడు.  నాతో పాటు రాష్ట్ర ప్రజలు నమ్మారు.  ప్రజలు ఆలోచన చేయాలి జగన్ వైఎస్సార్ ఆశయాలు నిలబెడుతున్నాడా ?  వైఎస్సార్ ఆశయాలను జగన్ కాపాడలేదని అన్నారు.
 వైఎస్సార్ రైతుల పక్షపాతి.  రుణమాఫీ చేశాడు.మద్దతు ధర ఇచ్చాడు.  పండిన పంట కంటే నష్టపోతే ఎక్కువ పరిహారం ఇచ్చాడు.  జగన్ పాలనలో రైతు తీవ్రంగా నష్టపోయాడు.  రైతులను మోసం చేశాడు.  ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి మోసం చేశాడు.  వైఎస్సార్ హయాంలో రైతు రారాజు.  జగన్ హయాంలో అప్పు లేని రైతు లేడు.  పంట నష్టం జరిగితే రూపాయి పరిహారం లేదు.  మొత్తం సబ్సిడీలను బంద్ పెట్టారు.  కనీసం డ్రిప్ వేసుకోవడానికి సబ్సిడీ లేదు.  రైతులను జగన్ ప్రభుత్వం నిండా ముంచింది.  మ్యానిఫెస్టో అంటే నాకు భగవద్గీత,ఖురాన్,బైబిల్ అన్నాడు జగన్. మద్యనిషేధం అని హామీ ఇచ్చాడు. - నిషేధం పక్కన పెడితే ప్రభుత్వమే ఆమ్ముతుంది.  ఇష్టం వచ్చిన రేట్లకు మద్యం అమ్ముతున్నారు. - కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు.  జగన్ మాట మద్యం షాపులో నిలబడింది.  మద్యం అమ్మకాల్లో లెక్కలు లేవు. ఎంత వస్తుందో పత్రాలు లేవు.  వైఎస్సార్ హయాంలో పెద్ద ఎత్తున నోటిఫికేషన్ లు ఇచ్చారు.  జంబో డీఎస్సీ ఇచ్చారు.  జగన్ ఎన్నికల్లో 2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అని హామీ ఇచ్చాడు. అధికారంలో వచ్చాకా పూర్తి స్థాయిలో ఉద్యోగాల భర్తీ అన్నాడు.  అధికారం ఇస్తే మెగా డీఎస్సీ వేస్తా అన్నాడు.  4న్నర ఏళ్లు నిద్ర పోయి ముష్టి 6 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ లు ఇచ్చాడు.  జగన్ వైఎస్సార్ వారసుడు కానే కాదు.  వైఎస్సార్ పాలన కు జగన్ పాలన కు పొంతనే లేదు.  బూతద్దం పెట్టీ చూసినా వైఎస్ పాలన ఆనవాళ్లు కూడా కనపడవు.  జగన్ పాలన హత్యా రాజకీయాలు చేసే పాలన.  సొంత బాబాయిని చంపిన నిందితులను కాపాడుతున్న పాలన. సిబిఐ  అవినాశ్ రెడ్డిని నిందితుడు అని చెప్పింది. అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పింది. కాల్ రికార్డ్స్,గూగుల్ మ్యాప్స్,లావాదేవీలు అన్ని ఉన్నాయని చెప్పింది. అన్ని ఆధారాలు ఉన్నా అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నాడు. వివేకా కేసులో నిందితుడు గా ఉన్న అవినాష్ రెడ్డి కే మళ్ళీ సీట్ ఇచ్చారు. నిందితుడు అవినాష్ రెడ్డి చట్టసభల్లో మళ్ళీ వెళ్ళకూడదు.  అన్యాయాన్ని ఎదిరించడానికి నేను ఎంపీ గా పోటీ చేస్తున్న. న్యాయం కోసం పోరాటం ఒకవైపు...హంతకులు ఒక వైపు.  న్యాయం ధర్మం ఒకవైపు...అధర్మం,హంతకులు ఒకవైపు.  ప్రజలు ఎవరిని గెలిపిస్తారో ఆలోచన చేయాలని అన్నారు.
వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి మాట్లాడుతూ  ఆడది అంటే ఒక నారి శక్తి.  మమ్మల్ని అలానే పెంచారు.  తప్పు అంటే తప్పు అని చెప్పే మనస్తత్వం మాది.  వివేకా ను హత్య చేసి మమ్మల్ని రోడ్ల పాలు చేశారు .  వివేకా హత్య ఎవరు చేశారో అందరికీ తెలుసు.  న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం. - షర్మిలను గెలిపించాలని కోరుకుంటున్న. షర్మిల ను ఎంపీ గా చూడాలని వివేకా కోరిక. ప్రజలు భారీ మెజారిటీ తో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.

Related Posts