హైదరాబాద్, ఏప్రిల్ 8
జిల్లాలో వివిధ ఎన్ఫోర్స్మెంట్ బృందాల ద్వారా ఆదివారం ఉదయం 6 గంటల నుండి సోమవారం ఉదయం ఆరు గంటల వరకు గడిచిన 24 గంటల వ్యవధిలో రూ. 7,30,400/- నగదు, 11,62,203/- రూపాయల విలువ గల ఇతర వస్తువులను, 386.73 లీటర్ల లిక్కర్ ను సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. నగదు, ఇతర వస్తువుల పై 8 పిర్యాదులు రాగా వాటిని పరిశీలించి పరిష్కరించినట్లు, 4 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. 12 లైసెన్స్ గల ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు వివరించారు.
జిల్లాలో ఇప్పటి వరకు 12 కోట్ల 69 లక్షల 71 వేల 620 రూపాయల నగదు, ఒక కోటి 85 లక్షల 22వేల 705 రూపాయల విలువ గల ఇతర వస్తువులు పట్టుకుని సీజ్ చేసినట్లు రోనాల్డ్ రోస్ తెలిపారు. 19,767.6 లీటర్ల మద్యం పట్టుకుని 144 కేసులు నమోదు చేసి 138 మందిని అరెస్ట్ చేశామని, నగదు ఇతర వస్తువులపై 288 ఫిర్యాదులు రాగా పరిశీలించి పరిష్కరించామని,189 ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేశారని , 2421 లైసెన్స్ గల ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి వివరించారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుండి ఇప్పటి వరకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల ద్వారా రూ. 2,77,88,800/-, పోలీస్, ఐటీ వారు రూ. 9,76,03,130/-, ఎస్ ఎస్ టీ బృందాల ద్వారా 15 లక్షల 79 వేల 690 రూపాయల నగదు సీజ్ చేసినట్లు తెలిపారు.