జగిత్యాల
మాజీ ముఖ్యమంత్రి,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం జగిత్యాల చేరుకున్నారు. ఇటీవల అనారోగ్యం తో మృతి చెందిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ తండ్రి మాకునూరి హన్మంతరావ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. తరువాత ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్,కుటుంబసభ్యులను పరామర్శించారు, కేసీఆర్ వెంట హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ లోక్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్,పలువురు బీఆర్ఎస్ నాయకులు వున్నారు.