YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బీఆర్ఎస్ ప్రచార రథాలను ప్రారంభించిన హరీష్ రావు

బీఆర్ఎస్ ప్రచార రథాలను ప్రారంభించిన హరీష్ రావు

పటాన్ చెరు
పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని శ్రీ సిద్ది గణపతి దేవాలయం (గణేష్ గడ్డ) సమీపంలో భారత రాష్ట్ర సమితి మెదక్ లోక్ సభ ఎన్నికల ప్రచార రథాలను మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. 
ఈకార్యక్రమంలో  పటాన్చెరు శాసన సభ్యులు  గూడెం మహిపాల్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్ సభ అభ్యర్థి వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గోన్నారు.
హరీష్ రావు మాట్లాడుతూ గణేష్ గడ్డకు మనకు అచ్చొచ్చిన స్థలం.  ఎంపి గెలుపు పక్కా. 2004 నుండి 2024 వరకు బి ఆర్ ఎస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పాల పొంగు లెక్క అయ్యింది. హామీలు ఇచ్చి కాంగ్రెస్ మొత్తం మరిచి పోయింది. హామీలు అమలు చేయక ముఖం చాటేసింది. ప్రభుత్వం వచ్చి 125 రోజులు అయినా రుణమాఫీ చెయ్యలేదు.  పదివేల రూపాయలు మా అక్కా చెల్లలకు చెల్లించాకే కాంగ్రెస్ ఓటు హక్కు అడగాలి.పింఛన్లు ఇవ్వకుండా చోద్యం చూస్తున్నారు. నిరుద్యోగ భృతి మీద రోజుకో మాట మాట్లాడుతున్నారు. భట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా అబద్ధం చెప్పారు. రైతులకు హామీలు ఇచ్చి మోసం చేశారు. అభయహస్తం అక్కరకు రాని హస్తం అయ్యింది. కెసిఆర్ కిట్టు బంద్ అయ్యింది. తిట్లు వచ్చాయి. కేసీఆర్ సిరిసిల్లకు వెళ్లి మాట్లాడారు. వడ్లకు 500 బోనస్ ఇవ్వలేదు అని అడిగారు.
15 వేల బోనస్ ఇస్తా అన్నావు ఇవ్వలేదు. భాష, సంస్కారం ఉండాలి కదా. వంద రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు చనిపోయారు. ఫేక్ వార్తలతో ఎన్నో రోజులు ఉండరని అన్నారు.
మీలాంటి వారికి గుణపాఠం తప్పదు. వెంకట్రామరెడ్డి గారు లోకల్ కాదు అంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో 38 ఓట్లు మహిపాల్ రెడ్డి కి ఓటు వేసి గెలిపించారు. పటాన్ చెరువులో ఉంటారు. రేపు ఎంపీగా ఉమ్మడి మెదక్ కు సేవలు అందిస్తారు. గల్లీ గల్లి తెలిసిన వ్యక్తి.  పార్లమెంట్ లో తెలంగాణ గళం విప్పుతాడు. ఎంతో మందికి సాయం చేశారు. వంద కోట్లతో విద్యా నిధి ఏర్పాటు చేశారు. రఘునందన్ మంచిగ పని చేస్తే దుబ్బకలో ఎందుకు గెలవలేదు. ఎన్నో హామీలిచ్చి అమలు చేయలేదు. అందుకే 54 వేల ఓట్లతో ఓడించారు. అధికారిగా అద్భుతమైన సేవలు అందించారు. పని చేసే కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి. పటాన్ చెరూ అభివృద్ధికి గళం విప్పుతారు. గళం ఎత్తేవారు కావాలా.. గులాం గిరీ చేసే వారు కావాలా? భవిష్యత్తులో అధికారం లోకి వచ్చేది బి ఆర్ పార్టీ నే. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.  అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.
వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ మెదక్ అంతే నాకు కుటుంబంతో సమానం. ఇక్కడ అధికారిగా పని చేసి, ఎంపీగా పోటీ చేసే అవకాశం రావడం అదృష్టం. ఎంపీగా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చాను. పార్లమెంట్లో తెలంగాణ గళం వినిపిస్తాను. మెదక్ ప్రజల సమస్య పరిష్కారం కోసం పోరాటం చేస్తాను. నన్ను ఆశీర్వదించి మంచి మెజారిటీతో గెలిపించాలని వేడుకుంటున్నానని అన్నారు.

Related Posts