పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో వాకర్స్ తో కలిసి వాకింగ్ చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు భారత రాష్ట్ర సమితి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. ఉదయాన్నే కళాశాల మైదానానికి చేరుకున్న అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తో కలిసి వాకర్స్ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం ఓటర్స్ తో కలిసి అల్పాహారాన్ని సేవించారు.
ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.... పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థులుగా గతంలో మన ఏరియా కు సంబంధించిన వారు ఉండేవారు కాదని, స్థానికుడైన తనకు మద్దతు తెలపాలని కోరుతున్నామని అన్నారు. గతంలో సింగరేణి నాయకుడిగా మంత్రిగా ఈ ప్రాంతంలో సేవ చేసే అవకాశం కలిగించారాని, ప్రస్తుతం ఎంపీ అభ్యర్థిగా భారత రాష్ట్ర తరపున పోటీ చేయడం జరుగుతుందని, తనకు ఒక అవకాశం ఇచ్చి గెలిపించాలని ఫోటోలను అభ్యర్థించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు వాకర్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు.