YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఓటు జారీ గల్లంతైందే...

ఓటు జారీ గల్లంతైందే...

హైదరాబాద్, ఏప్రిల్ 12
 రాజకీయ పార్టీ బలంగా ఉంది అని చెప్పుకోవాలంటే అందరూ చూసే ఒకే ఒక్క పాయింట్ .. ఆ పార్టీకి ఎంత ఓటు షేర్ ఉంది అనే. ఈ ఓటు షేర్ అనేది రాజకీయ వ్యవహారిక భాషలో ఓటు బ్యాంక్ అని చెప్పుకోవచ్చు.పార్టీకి నిజాయితీగా ఓట్లు వేసే ఓటర్లు ఎంత ఎక్కువ మంది ఉంటే.. వారందర్నీ ఓటు బ్యాంక్ అనుకోవచ్చు.  ఓటు బ్యాంక్ ఉన్న పార్టీకే విలువ ఉంటుంది. ఈ ఓటు బ్యాంక్ ను రాజకీయ పార్టీలు వివిధ పద్దతుల్లో క్రియేట్ చేసుకుంటూ ఉంాయి. కులం, మతం, ప్రాంతం , భావోద్వేగ అంసాల ఆధారంగా సృష్టించుకుంటాయి.  ప్రస్తుతం అత్యధిక పార్టీల ఓటు బ్యాంక్ కులమే. ప్రస్తుతం దేశంలో అయినా రాష్ట్రాల్లో అయినా రాజకీయ పార్టీలు బలంగా ఉన్నాయంటే.. కులాల సపోర్టుతోనే. తెలుగుదేశం పార్టీకి  కమ్మ, బీసీ వర్గాలు అండగా ఉంటూ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ముస్లిం, దళితులు, రెడ్డి వర్గం వారు సపోర్టు చేస్తున్నారు. ఏపీలో వైసీపీకి రెడ్డి, ముస్లిం, దళిత వర్గాల మద్దతు ఉంది. ఏపీలో జనసేన పార్టీ కీలకంగా మారిందంటే దానికి కారణం కాపు వర్గం మద్దతు ఉండబట్టే. ఆరు శాతం ఓట్లు ఆ పార్టీకి ఉన్నాయి. అదే ఆ పార్టీ ఓటు బ్యాంక్. అందుకే విలువ వచ్చింది. కేసీఆర్ కు ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల సంగతి తెలియనిదేం కాదు. అందుకే ఆయన రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కుల బలం చూసుకుంటే పరిమితంగా ఉంటామని..అంతే  ప్రాంత భావనతో అయితే ఏకపక్ష విజయాలు వస్తాయి.. ప్రజలంతా ఓటు బ్యాంక్ అవుతారని అనుకున్నారు. అందుకే ప్రజల్లో నిగూఢంగా ఉన్నా తెలంగాణ వాదాన్ని అందుకున్నారు. ఒడిదుడుకులు అయినా ఆయన ముందుకు సాగారు. విజయంతం అయ్యారు. ఎన్నికల్లో ఆయన గెలిచిన  ప్రతీ సారి తెలంగాణ సెంటిమెంటే విజయాస్త్రం. తెలంగాణ అంటే బీఆర్ఎస్ అన్నట్లుగా  రాజకీయం సాగింది. అభ్యర్థి ఎవరన్నది చూసుకోలేదు..కారు గుర్తు ఉంటే చాలు ఓటేశారు. అంటే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ .. తెలంగాణ సెంటిమెంట్ గుండె నిండా నింపుకున్నవారే. వారిలో సెంటిమెంట్ పెంచేందుకు కేసీఆర్ చేయగలిగినదంతా చేశారు. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ఉన్న ప్రజలను ఓటు బ్యాంక్‌గా మార్చుకుని అనుకున్న విజయాలు సాధించారు. కానీ కులం, మతం లాగా.. ఈ తెలంగాణ సెంటిమెంట్ శాశ్వతం కాదు. అక్కడే కేసీఆర్ రాజకీయంగా తప్పటడుగు వేశారు. తెలంగాణ సాధనే లక్ష్యం అనుకున్న తర్వాత.. లక్ష్యం చేధించిన తర్వాత ఇక సెంటిమెంట్ ఉంటుందనుకోవడం అత్యాశే. అయితే కేసీఆర్ తనదైన రాజకీయంతో పదేళ్ల  పాటు నెట్టుకు రాగలిగారు. ఈ పదేళ్లలో ఆయన తెలంగాణ సెంటిమెంట్ కు అతీతమైన ఓటు బ్యాంక్‌ను సృష్టించుకోవడంలో విఫలమయ్యారు. ఏ సామాజికవర్గాన్ని దగ్గర చేసుకోలేకపోయారు. కేసీఆర్ సొంత సామాజికవర్గం చాలా స్వల్పంగా ఉంటుంది. గత అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి వర్గాలు కాంగ్రెస్ వైపు నిలిచాయని అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ సెంటిమెంట్ లేకపోవడంతో బీఆర్ఎస్ ఘోర పరాజయాల్ని చవి చూసింది.  రెడ్డి వర్గానికి కేసీఆర్ చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆయన కేబినెట్‌లో ఆరుగురు రెడ్డి మంత్రులు ఉండేవారు. కానీ వారంతా సంప్రదాయకంగా కాంగ్రెస్ మద్దతుదారులు. సెంటిమెంట్ కారణంగా బీఆర్ఎస్‌కు మద్దతిచ్చారు. మళ్లీ కాంగ్రెస్ వైపు వెళ్లిపోయారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచిందేమీ లేదంటే.. వారు ఎంత  దూరమయ్యారో అర్థం చేసుకోవచ్చు. చివరికి  బీసీల్లోని ప్రధాన సామాజికవర్గాలను కూడా కేసీఆర్ కొన్ని కీలక నిర్ణయాలతో  దూరం చేసుకున్నారు.  ముదిరాజ్ లాంటి పెద్ద సామాజికవర్గానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. పద్మశాలీలకు కూడా టికెట్లివ్వలేదు. పైగా గెలవలేరని అందుకే ఇవ్వలేదని మొహం మీదనే చెప్పారు.  దాంతో 26.25 లక్షలున్న ముదిరాజుల ఓట్లలో అత్యధికం బీఆర్ఎస్ కు దూరమైంది. అలాగే 11.80 లక్షలున్న పద్మశాలీల్లో కూడా తమనుపై కేసీయార్ చిన్నచూపు చూశారని దూరమయ్యారు.  ముదిరాజ్ నేత అయిన ఈటల రాజేందర్ ను కేసీయార్ కావాలనే అవమానించారనే అభిప్రాయం వాళ్లలో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతం తెలుగుదేశం పార్టీ బలంగా ఉండటానికి కారణం బీసీల మద్దతే. విప్లవాత్మక నిర్ణయాలు, బీసీ నేతలకు అవకాశాలు కల్పించడం ద్వారా ఆ పార్టీకి మద్దతుగా ఉండేలా చూసుకున్నారు. ఇప్పుడు ఆ పార్టీ ఉనికి లేకపోవడంతో బీసీ వర్గాలు ఇతర పార్టీల వైపు మళ్లాయి. వీరిని ఆకట్టుకోవడంలో కేసీఆర్ నిర్లక్ష్యాన్ని కాంగ్రెస్ అనుకూలంగా మల్చుకుంది.  పై సామాజికవర్గాలు బలమైన మద్దతుదారుగా ఉండటం వల్లే 2004,2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. రాష్ట్రవిభజన తర్వాత 2014, 2019 ఎన్నికల్లో పై సామాజికవర్గాలు బీఆర్ఎస్ కు మద్దతుగా ఉండటంతో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. 2023 ఎన్నికల్లో కేసీయార్ స్వయంకృతం వల్ల మెజారిటి సామాజికవర్గాలు దూరమవ్వటంతో ఫలితం రివర్స్ అయింది. ఇప్పుడు కేసీఆర్ మళ్లీ  బీసీలను ఆకట్టుకుని బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.  అందుకనే 17 పార్లమెంటు సీట్లలో ఆరుసీట్లను బీసీలకే కేటాయించారు. జహీరాబాద్, నిజామాబాద్ నియోజకవర్గాలను మున్నూరుకాపులకు కేటాయించారు. చేవెళ్ళ సీటులో ముదిరాజ్ ను పోటీచేయిస్తున్నారు. సికింద్రాబాద్ టికెట్ ను గౌడ్ కు ఇచ్చారు. భువనగిరిలో గొల్ల కురుమ, హైదరాబాద్ సీటును యాదవ సామాజికవర్గానికి కేటాయించారు. అలాగే బీసీ వర్గాలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని అనుకుంటున్నారు.  ముదిరాజ్ సామాజికవర్గంలోని పెద్దలతో భేటీ అవబోతున్నారు. అలాగే  మున్నూరుకాపులు, యాదవులతోనూ సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే దూరమైన వర్గాలను దగ్గర చేసుకోవడం అంత తేలిక కాదు. సక్సెస్ అయితే మాత్రం బీఆర్ఎస్ ఉనికిపై వస్తున్న సందేహాలన్నీ పటాపంచలు అయిపోతాయి.

Related Posts