YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మాదిగలను పట్టించుకోని కాంగ్రెస్

మాదిగలను పట్టించుకోని కాంగ్రెస్

హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీ హయాంలో మాదిగలకు జరుగుతున్న అన్యాయం వెలుగులోకి తీసుకవస్తున్నామని ఎమ్మార్పిఎస్ అధినేత  మంద కృష్ణ మాదిగ అన్నారు. మోత్కుకపల్లి నరసింహులు వు మొదటి నుంచి మాదిగలకు అండగా నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ కేటాయింపు లో మాదిగలకు జరిగిన అన్యాయం పట్ల ఆవేదన వ్యక్తం చేసారు ..ఆయన అభిప్రాయం ని నిక్కచ్చిగా  చెప్పారు. నా విమర్శలో న్యాయం ఉంది .. నేను బీజేపీ కి సపోర్ట్ చెయ్యడం లో అర్ధం ఉంది. కంటోన్మెంట్ ఎస్సీ రిజర్వేషన్ స్థానం కూడా మాదిగలకు ఇవ్వలేదు. మోతుకుపల్లి మాటలకి కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలి. నామినేషన్ లకి ఇంకా సమయం ఉంది .. ఆ లోపు కూడా మార్పు జరగకపోతే ఊరుకునేది లేదు. బి ఫారం మల్లు రవికి బదులు సంపత్ కి ఇవ్వాలని అన్నారు.
పార్టీ సభ్యత్వం లేని కావ్య కి టికెట్ ఇచ్చారు. మంత్రి దామోదర్ రాజనరసింహ కి విలువ లేదు. బాబు జగ్గీవాన్ భవనం ఆవిష్కరించిన రోజు దామోదర్ నరసింహ కి ఆహ్వానం లేదు. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మాదిగల తరపునా ఉన్న దామోదర్ నరసింహ ఉన్నట్టు కూడా రేవంత్ కి గుర్తు లేదు. రెడ్లు మాలలు వేస్తె గెలవలేదు .. కెసిఆర్ ప్రభుత్వం మీద ఉన్న కోపం తో అధికారంలోకి వచ్చారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన అధికారులందరూ వెలమలే. ఫోన్ ట్యాపింగ్ లో పీపీ గా  సాంబ శివ రెడ్డి ని నియమించారు ..అన్నిటిలోను రెడ్డి ఆధిపత్యం నే ఉంది. షబ్బీర్ అలీ రేవంత్ రెడ్డి ని పొగిడారు .. కానీ ఒక్క ముస్లిమ్ మంత్రి కూడా లేరు. ముస్లిం ఓట్లు అన్ని కాంగ్రెస్ పార్టీ కి వేశారు అని అన్నారు .. అయినప్పటికీ మంత్రి వర్గంలో చోటు దక్కలేదని అన్నారు.

Related Posts