YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మెదక్ లో కాంగ్రెస్ దే గెలుపు కొండా సురేఖ

మెదక్ లో కాంగ్రెస్ దే గెలుపు కొండా సురేఖ

పటాన్ చెరు
మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ స్ధానాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ కైవసం చేసుకోబోతుందని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు.
పటాన్ చెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలో గణేష్ గడ్డ దేవాలయంలో పూజా కార్యక్రమాలు చేసి కాంగ్రెస్ ఎం పి అభ్యర్థి నీలం ముదిరాజ్ తరపున ఎన్నికల ప్రచార రధాలను రాష్ట్ర మంత్రి కొండా సురేఖ,కాంగ్రెస్ పార్టీ టిపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి, కాంగ్రెస్ నాయకులు మైనం పల్లి హనుమంతరావు కలిసి ప్రారంభించారు.  ఈ సందర్భంగా  మంత్రి  కొండా సురేఖ మాట్లాడుతూ మెదక్ లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఇతర పార్టీలు బీసీలను బహిష్కరించాయన్నారు.  మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు.ప్రణాళికా బద్ధంగా పార్టీ విజయానికి కృషి చేస్తున్నామని,. పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు శాసనసభ ఎన్నికలలో కొంత కమ్యునికేషన్ గ్యాప్ తో ఓటమి పాలయ్యామని, పొరపాట్లు సాదారణంగా జరుగుతుంటాయని.. వాటిని మనమే పరిష్కారం చేసుకుందామన్నారు.  బేషజాలు, భేదాభిప్రాయాలు వీడనాడి పార్టీ గెలుపునకు పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ యంపి ఎన్నికల్లో బిఆర్ఎస్, కాంగ్రెస్ కు మాత్రమే పోటీ ఉంటుందన్నారు మేము కొట్టే పంజాలకు ఇతర పార్టీలు గిలగిల కొట్టుకోవాల్సిందేనన్నారు.
మెదక్ పార్లమెంట్ సీటు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్నారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ బిసీలకు కాంగ్రెస్ మాత్రమే అవకాశం కల్పిస్తుంది న్నారు ఈ సారి మెదక్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అన్నారు. ఇందిరా గాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ స్ధానాన్ని కాంగ్రెస్ గెలుస్తుందని జోస్యం చెప్పారు.

Related Posts