సిద్దిపేట
కొండ భూదేవి గార్డెన్ లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సిద్దిపేట పట్టణ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు హ జరయ్యారు. హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో మళ్ళీ వచ్చేది బి అర్ ఎస్ ప్రభుత్వమే. మనం పదేళ్లు పాలించినం... వాళ్ళు వచ్చి నాలుగు నెలలు కాలేదు.. ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగింది. సిద్దిపేటలో సగం కట్టిన వెటర్నరీ కాలేజీని రద్దు చేసి కొడంగల్ కు తరలించుకు పోయిండు రేవంత్ రెడ్డి. వంద రోజుల్లో ఆరు గ్యారంటీ లు అని గంభీర ఉపన్యాసాలు ఇచ్చారు.. ఇప్పుడు అన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రేవంత్ రెడ్డి దగ్గర సరుకు లేదు.. పని లేదు. ప్రజలకు కాంగ్రెస్ మీద కోపం వచ్చింది. కాంగ్రెస్ మీద కోపం తో బిజెపి కి ఓటేస్తే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయితది. బిజెపి పేదలకు, తెలంగాణకు వ్యతిరేక పార్టీ. సిలేరును లాక్కుని మనకు అన్యాయం చేసిన పార్టీ. పదేళ్లలో బిజేపీ చేసిన ఒక్క మంచి పని ఉందా? అసెంబ్లీ ఎన్నికల్లో బి అర్ ఎస్, బిజేపీ ఒక్కటే అని రేవంత్ రెడ్డి బురజ చల్లిండ్లు.. ఇప్పుడు బడే మియ అంటుండు. కాంగ్రెస్, బిజేపీ ఒక్కటై తెలంగాణ లో బి అర్ ఎస్ లేకుండా చేయాలనే కుట్ర పన్నుతున్నరు. ఇంటికి రెండెడ్లు, నిరుద్యోగ భృతి ఇస్తానని, రైలు తెస్తానని అబద్ధాలు చెప్పి ఉప ఎన్నికల్లో గెలిచిండు.. మొన్నటి ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టారు. ప్రత్యర్థుల తప్పుడు ప్రచారాలను సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలు పని చేయాలి. బిజెపి ని ఓడించే శక్తి బి అర్ ఎస్ కె ఉందని ముస్లిం సోదరులు గుర్తించాలి. ఇచ్చిన హామీలు తప్పిన కాంగ్రెస్ మెడలు వంచాలంటే ఎంపీ ఎన్నికల్లో బి అర్ ఎస్ గెలవాలి. - గులాబీ జెండా ప్రాణం పోసింది సిద్దిపేట. సిద్దిపేట కు అన్యాయం జరిగితే... అక్కసు వెళ్ళగట్టితే ఉరుకుందామా.. సిద్దిపేట ప్రజలుగ చీము నెత్తురు ఉన్నోళ్ళం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కి ఓట్లు వేసి మోస పోదామా. సిద్దిపేట కు వచ్చిన వెటర్నరీ కాలేజ్ ను రేవంత్ రెడ్డి కొడంగల్ తీసుకుపోయిండు. సిద్దిపేట లో వివిధ అభివృద్ధి పనులు, రోడ్లు కు 150 కోట్లు రద్దు చేసిండు. - సిద్దిపేట అభివృద్ధి ఫై కాంగ్రెస్,బీజేపీ పార్టీ లు రెండు అక్కసు వెళ్ళబుచ్చారు. అలాంటి వారిని సిద్దిపేట లో ఓట్లు ఎట్లా వేస్తామని ప్రశ్నించారు.