YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైసీపీకి షాక్ ఇచ్చిన వాలంటరీలు

వైసీపీకి షాక్ ఇచ్చిన వాలంటరీలు

నెల్లూరు
అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వాలంటరీ వ్యవస్థ పట్టుకొమ్మ లాంటిది.  నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు పంచాయతీకి చెందిన 40 మంది వాలంటరీలు ప్రతిపక్ష టీడీపీకి మద్దతు పలికారు. నెల్లూరు తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  కోవూరు  అభ్యర్థి  వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమక్షంలో 40 మంది వాలంటరీలు టిడిపిలో చేరారు.వాలంటరీలకు వేమిరెడ్డి దంపతులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోవూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ.. అధికార వైసీపీ నేతల అరాచకాలు తట్టుకోలేక  వాలంటరీలు టిడిపిలో చేరారన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.  చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం ప్రజల కోసం స్వచ్ఛందంగా పనిచేస్తున్న వాలంటరీ వ్యవస్థకు 10000 గౌరవ వేతనం  అందిస్తాం అనడం వాలంటరీ వ్యవస్థలో ఉత్సాహాన్ని నింపిందన్నారు.  తనపై వ్యక్తిగత విమర్శలు చేసే ప్రతి ఒక్కరికి ప్రజాసేవతోనే సమాధానం చెబుతామన్నారు.

Related Posts