YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎన్ని కుట్రలు చేస్తారొ చేయండి....

ఎన్ని కుట్రలు చేస్తారొ చేయండి....

కడప
పులివెందుల లో ని వైయస్సార్ ఆడిటోరియంలో బలిజ సంఘం ఆత్మీయ సమావేశం జరిగింది.  ఈ కార్యక్రమంలో పులివెందుల నియోజకవర్గంలోని బలిజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ బలిజలకు 31 ఎమ్మెల్యే 5 ఎంపీ స్థానాలు ఇచ్చామని, బలిజలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.  గడచిన 16 నెలలుగా వర్షాలు పడలేదని గండికోట, చిత్రావతి, పైడిపాలెం, కార్యకర్తలు ప్రాజెక్టులను నీళ్లు పుష్కలంగా నింపినందు వల్లనే   ప్రస్తుతం రైతులకు తాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉందని అన్నారు. 2014 లో చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ, జనసేన, బిజెపి,  కూటమి అధికారంలోకి వచ్చిందని అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్క హామీని విస్మరించారని అన్నారు. చంద్రబాబు నాయుడు కు ధైర్యం సరిపోలేదని 2014 లో ఇచ్చినటువంటి అబద్ధపు హామీలను మళ్లీ ఇస్తున్నారని అధికారం కోసం చంద్రబాబు నాయుడు దిగజారిపోతారని మా కుటుంబం లో కూడా చీలికలు తెచ్చారని ఎంత ద్వేషంతో వాళ్లు మాట్లాడుతున్నారో చూడాలని, వైఎస్ భాస్కర్ రెడ్డి, వైయస్ అవినాష్ రెడ్డి, ఎలాంటి వాడో ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసని అన్నారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టెలని గడచిన మూడేళ్లుగా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినప్పటికీ చెక్కుచెదరని ఆత్మ  విశ్వాసంతో ఉన్నామని అన్నారు. ఎన్ని కుట్రలు చేస్తారొ చేయండి.... ప్రజల్లోనే ఉంటా ప్రజల కోసం పని చేస్తా అన్నారు. .

Related Posts