YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కూటమి అబ్యర్థి గెలుపే లక్ష్యం కే మీనాక్షి నాయుడు

కూటమి అబ్యర్థి గెలుపే  లక్ష్యం  కే మీనాక్షి నాయుడు

ఆదోని
ఆదోని నియోజకవర్గం తెదేపా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ బాధ్యులు కొంకా మీనాక్షి నాయుడు కూటమి అభ్యర్థి అయిన డాక్టర్ పార్థసారథి గెలుపే లక్ష్యంగా తెదేపా, బిజెపి, జనసేన నాయకులు కార్యకర్తలు ఆదోని నియోజకవర్గం లో కూటమి జెండాను ఎగురవేయాలని మీనాక్షి నాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక పట్టణములోని జేబీ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో తెదేపా పార్టీ ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ బాధ్యులు కే మీనాక్షి నాయుడు అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం లో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థి కే నాగరాజు ఆదోని బిజెపి టిడిపి జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పార్థసారథిలు పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు మాట్లాడుతూ  జిల్లాలో, ఆదోని నియోజకవర్గం లోని తెదేపా బిజెపి జనసేన, నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా త్వరలో జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా  కృషి చేయాలని అభ్యర్థులు కోరారు . కేంద్రము లో ఎన్ డి ఎ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్  రాష్ట్రములో తెదేపా ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబు నాయుడు పరిపాలించడం జరుగుతుందన్నారు.  ఆదోని నియోజకవర్గం తోబాటు  జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Posts