YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రజాశాంతికి కుండ గుర్తు

ప్రజాశాంతికి కుండ గుర్తు

విజయవాడ, ఏప్రిల్  13
తమ పార్టీ కి ఎన్నికల సంఘం కుండ గుర్తు కేటాయించినట్టు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ పేర్కొన్నారు. ఆయన రైల్వే న్యూ కాలనీలో గల పార్టీ కార్యాలయంలో ) జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీకి కుండ గుర్తు కేటాయించిన ఎన్నికల సంఘం అధికారులు, హై కోర్టు న్యాయమూర్తులకు ధన్య వాదాలు తెలిపారు. కుండలు తయారు చేసే కుమ్మరి మాదిరిగానే తాను కూడా ప్రజలు జీవితాలు తీర్చి దిద్దుతానని అన్నారు. విశాఖపట్నంలోని రైల్వే న్యూ కాలనీలో కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు.ప్రజలు ఫ్యాన్లకు (వైసీపీని ఉద్దేశించి) ఉరి వేసుకుని చనిపోయినట్టు కేఏ పాల్ ఎద్దేవా చేశారు. గ్లాసులు (జనసేనను ఉద్దేశించి) పగిలి పోయాయి. సైకిళ్లకు (టీడీపీ) ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. కోర్టులో కేసు వేసి కుండ గుర్తు సాధించానని అన్నారు. ఉచిత విద్య, వైద్యం, నిరుద్యోగులకు ఉపాధి స్టీల్ ప్లాంట్ అనుబంధంగా వెయ్యి కంపెనీల ద్వారా ఉపాధి కల్పిస్తామని అన్నారు. ప్రజలు మోదీ, కేసీఆర్, జగన్ కు అవకాశం ఇచ్చారు. ప్రజా శాంతి పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలి అని కోరారు. ప్రధాన పార్టీల్లో టిక్కెట్లు రాని వారు మా పార్టీలో చేరడానికి వస్తున్నారు. రుషికొండలో కొండ మాయం చేశారు. కుటుంబ, కుల పాలనకు చరమ గీతం పాడాలి. స్టీల్ ప్లాంట్ భూములను అమ్మేస్తున్నారు. కంపెనీలు అహ్మదాబాద్ తరలిపోతున్నాయి. బొత్స సత్యనారాయణ కుటుంబం ఇన్నాళ్లు శ్రీకాకుళంలో దోచుకుని ఇప్పుడు విశాఖ వచ్చింది’’ అని కేఏ పాల్ ఆరోపించారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ నాయకులు యేసు పాదం, శుభాకర్, బాబు రావు, జిలు కర రవి కుమార్, బాబుజీ రావు పాల్గొన్నారు

Related Posts