YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రావులపాలెంలో 18న జగన్ సిద్ధం సభ

రావులపాలెంలో 18న జగన్ సిద్ధం సభ

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 18 వ తేదీ గురువారం మధ్యాహ్నం 03:00 గంటలకు రావులపాలెంలో జరగబోయే సిద్ధం భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారని ఉమ్మడి గోదావరి జిల్లాల వై.యస్.ఆర్.సి.పి.రీజినల్ కోఆర్డినేటర్లు పిల్లి సుభాష్ చంద్రబోస్, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ రావులపాలెంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలియచేశారు.
15 వ తేదీన రాజమండ్రి చేరుకోనున్న జగన్ గారు
16 వ తేదీన రాజమండ్రిలో రోడ్ షో నిర్వహించి,
17 వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా సెలవు తీసుకుని,
18 వ తేదీ మధ్యాహ్నం రావులపాలెంలో జరగబోయే సిద్ధం భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు.
ఈ సభకు సుమారు 2 లక్షల మంది ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, నాయకులు హాజరు అవుతారని అంచనాల నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ సభకు హాజరై విజయవంతం చేయవలసినదిగా కోరారు.
ఈ సమావేశంలో వైసీపీ నాయకులు కుడుపూడి సూర్యనారాయణ, తోట త్రిమూర్తులు, పొన్నాడ వెంకట సతీష్, చిర్ల జగ్గిరెడ్డి, పిల్లి సూర్యప్రకాష్, విప్పర్తి వేణుగోపాల్, రాపాక వరప్రసాద్, చింతా అనురాధ తదితరులు పాల్గొన్నారు.

Related Posts