ఖమ్మం
జిల్లా సరిహద్దు తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం స్టేజీలో గల చెక్ పోస్టు వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాహనాన్ని ఎన్నికల సిబ్బంది, పోలీసులు తనిఖీ చేశారు.పాలేరు నియోజవర్గ పరిధిలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తుండగా రెవిన్యూ గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాహనాన్ని పోలీసులు ఎన్నికల సిబ్బంది తనిఖీ చేశారు.మాదిరిపురం వద్ద మంత్రి వాహనాన్ని ఆపడంతో పొంగులేటి తన వాహన తనిఖీకి పూర్తిగా సహకరించారు. తనిఖీ అనంతరం పొంగులేటి బయలుదేరారు.