YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాంగ్రెస్, బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన సంజయ్

కాంగ్రెస్, బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన సంజయ్

కరీంనగర్ లో జరిగిన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ స్థాయి నాయకులతో ‘బూత్ విజయ సంకల్ప్ అభియాన్’ సమావేశంలో బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శి ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమావేశానికి బండి సంజయ్ తోపాటు ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాశ్ జీ హాజరయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగిన బండి సంజయ్, పార్లమెంట్ ఎన్నికలను క్రికెట్ తో పోలుస్తూ... హాట్ కామెంట్స్ చేశారు. ఐపీఎల్ క్రికెట్ మాదిరిగానే దేశ రాజకీయాల్లోనూ ఇండియన్ పొలిటికల్ లీగ్ (ఐపీఎల్)  మ్యాచ్ నడుస్తుందన్నారు. ఒకవైపు నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బీజేపీ టీం బరిలో దిగితే, మరోవైపు ఐఎన్డీ కూటమి పేరుతో గుంట నక్కల పార్టీలన్నీ టీంగా బరిలో ఉన్నాయని విమర్శించారు. ఆ కూటమి టీంను చిత్తుగా ఓడించి 400ల స్థానాలతో కేంద్రంలో మోదీ ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్ కొట్టబోతున్నారని స్పష్టం చేశారు. దేశంలో మాదిరిగానే రాష్ట్ర రాజకీయాల్లోనూ తెలంగాణ పొలిటికల్ లీగ్ (టీపీఎల్) ఆట మొదలైందన్నారు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నాతోసహా 17 మంది సభ్యుల టీం బరిలోకి దిగామని, అటువైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ గుంట నక్కల టీంలు బరిలో దిగినాయని తెలిపారు. వేర్వేరుగా బీజేపీని ఓడించడం సాధ్యం కాదని.. చీకటి ఒప్పందాలతో ఆ రెండు పార్టీలు ఒక్కటైనాయని ఆరోపించారు. అయినప్పటికీ ఆ రెండు పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించి టీపీఎల్ కప్ ను గెలిచి, మోదీకి గిఫ్ట్ ఇవ్వబోతున్నామనే ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అతి తక్కువ వ్యవధిలో అత్యంత ప్రజావ్యతిరేకత ఎదుర్కొన్న ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని వ్యాఖ్యానించారు. రైతులంతా కొనుగోలు కేంద్రాల వద్ద వడ్ల రాశులు పోసినా కొనేనాథుడే లేరన్నారు. తాలు, తరుగు పేరుతో దోచుకునేందుకు దళారులు సిద్ధమైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతులను మోసం చేస్తే మిల్లర్ల, వ్యాపారుల లైసెన్స్ రద్దు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం.... వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ లైసెన్స్ ను కూడా ప్రజలు రద్దు చేయబోతున్నారని తెలిపారు.

Related Posts