కాప్రా సర్కిల్ చిలుకనగర్లోని మునవ్వార్ మజీద్లో రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందించే గిఫ్టు ప్యాకెట్లను పేద ముస్లింలకు పంపిణీ చేసిన మేయర్ బొంతు రామ్మోహన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల అభివృద్దికి కేసీఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రంజాన్ సందర్భంగా ఈ సంవత్సరం నగరంలో 400 మజీద్ల వద్ద పేద ముస్లింలకు బట్టల పంపిణీ చేపడుతున్నామని అన్నారు. 400మజీద్ల వద్ద ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయనున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి కమిషనర్ యాదగిరిరావు, కార్పొరేటర్ గోపు సరస్వతి తదితరులు పాల్గొన్నారు.