తెలంగాణ రాష్ట్ర 4వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.గడిచిన నాలుగు సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమ మరియు అభివృద్ధి కొరకు అనేక కార్యక్రమాలు చేపట్టింది. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కొరకు చేపట్టిన కార్యక్రమాలు కొనసాగించాలి. సంక్షేమ మరియు అభివృద్ధి ఫలాలు చిట్టచివరి వ్యక్తి వరకు అందేలా చూడాలి. ప్రజల సంతోషమే ప్రభుత్వ విజయాలకి కొలబద్ధత.రాబోయే రోజులలో ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ నిబద్ధతతో, పారదర్శకంగా అందరికీ అందేలా చూడాలి. బంగారు తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వానికి విజయం చేకూరాలని కోరుకుంటున్నాను"సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి"రాష్ట్ర ప్రజలందరికి మరోమారు శుభాభివందనాలని గవర్నర్ తన సందేశం లో పేర్కొన్నారు.