చారిత్ర మక్కా మజీద్లో వాటర్ ఏటీఎంను చార్మినార్ ఎమ్మెల్యే పాషాఖాద్రితో కలిసి డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్ నేడు ప్రారంభించారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మక్కా మజీద్తో పాటు పలు మజీద్లలో మౌలిక సదుపాయాలను జీహెచ్ఎంసీ కల్పిస్తోంది. దీనిలో భాగంగా ఏర్పాటుచేసిన వాటర్ ఏటిఎంను నేడు ప్రారంభించారు. అనంతరం ఘాన్సిబజార్ మూసాబౌలి మజీద్ను సందర్శించారు. మూసాబౌలి వద్ద పెద్ద ఎత్తున చెత్త, వ్యర్థపదార్థాలు పేరుకొని ఉండడం పట్ల స్థానిక ఎస్.ఎఫ్.ఏ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్.ఎఫ్.ఏకు జరిమానా విధించాల్సిందిగా మెడికల్ ఆఫీసర్ ఖాద్రిని డిప్యూటి మేయర్ ఆదేశించారు.