గుంటూరు జిల్లాలో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 44 మంది బెట్టింగ్ రాయుళ్లు, బూకీలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పట్టుబడిన వారిని ఎస్పీ అప్పలనాయుడు మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారి వద్ద నుంచి రూ.10.52 లక్షల నగదు, కమ్యూనికేటర్ బాక్స్, 81 సెల్ ఫోన్లు, 1కారు, 2 లాప్ టాప్స్, 6.5 కేజీలు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గతకొద్దికాలంగా చిలకలూరిపేట, సత్తెనపల్లి, నరసరావుపేట, వినుకొండ కేంద్రాల్లో జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్లపై రూరల్ ఎస్పీ అప్పలనాయుడు ఉక్కుపాదం మోపారు. నెలక్రితం ఒకేసారి రెండు విడతలుగా 65 మంది క్రికెట్ బుకీలను అరెస్ట్ చేయడంతో పాటు కీలక సూత్రధారిని అరెస్ట్ చేశారు. అతడికి సంబంధించిన రూ.2కోట్ల ఆస్తులను సీజ్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.