YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి

ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన  సికింద్రాబాద్ పార్లమెంట్   బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి

హైదరాబాద్
బోరబండలో పలు ప్రాంతాల్లో   ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా సికింద్రాబాద్ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి తెర తీశారు. ఏకంగా పార్లమెంటు పరిధిలో ఉన్న ఓటర్లు వివరాలను తీసుకొని ప్రతి ఒక్క ఓటరుకు వారి క్రమ సంఖ్య బూత్ నంబర్ వివరాలను ఒక భారతీయ జనతా పార్టీ కరపత్రంలో పొందుపరచి ఇంటింటికి వాటిని చేరేలా చేస్తున్నారు. నిబంధనలు ప్రకారం ఏ పార్టీ నాయకులు ఓటర్ స్లిప్పులు కూడా పంచడం నేరమే అవుతుంది, కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఏకంగా పార్టీ సింబల్ తోనే కరపత్రాన్ని తయారుచేసి అందులో ఓటరు వివరాలను నిక్షిప్తం చేసి ఓటర్లకు అందించడం తీవ్ర చర్చ నియాంశంగా మారింది. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని అధికులు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts