YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజల కలలన్నీ నెరవేరాలి

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు           తెలంగాణ ప్రజల కలలన్నీ నెరవేరాలి
తెలుగు రాష్ట్రాలు ఏర్పడి నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఏపీ, తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. "ఆంధ్రప్రదేశ్ సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. రానున్న కాలంలో తెలంగాణ ప్రజల కలలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా" అంటూ ట్వీట్ చేశారు.ఇదిలా ఉంచితే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మరోవైపు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు.

Related Posts