YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మసీదుల మరమ్మతులకు రూ.5కోట్లు విడుదల రంజాన్ తోఫా సక్రమంగా అందించాలి అధికారులతో సమీక్షలో సీఎం చంద్రబాబు

మసీదుల మరమ్మతులకు రూ.5కోట్లు విడుదల       రంజాన్ తోఫా సక్రమంగా అందించాలి             అధికారులతో సమీక్షలో సీఎం చంద్రబాబు
రంజాన్ తోఫా సక్రమంగా అందించాలి.12లక్షల కుటుంబాలకు రంజాన్ తోఫా చేరాలి.రాష్ట్రంలో ప్రతి పేద ముస్లిం కుటుంబ సభ్యులతో సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకోవాలని ముఖ్య మంత్రి చంద్ర బాబు ఆకాంక్షించారు.అన్ని జిల్లాలలో మసీదుల మరమ్మతులకు,ఇఫ్తార్ నిర్వహణకు రూ.5కోట్లు విడుదల చేశాం.వీటిని సద్వినియోగం చేసుకోవాలి.మసీదులకు రంగులు వేయడం,చిన్నచిన్న మరమ్మతు పనులను పూర్తిచేయాలన్నారు.రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని అన్ని చోట్ల ఖురాన్ పఠనం పోటీలు నిర్వహించాలని,పెద్ద మదర్ సా లలో కంప్యూటర్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలి.ముస్లిం యువతకు ఉర్దూలో శిక్షణ ఇవ్వాలి,నైపుణ్యాలు మెరుగుపరచాలి.ఉపాధి అవకాశాలు విస్తృత పరచాలని పేర్కొన్నారు.ముస్లిం అనాధలకు,ఒంటరి మహిళలకు,వితంతువులకు సంతృప్తస్థాయిలో(శాచురేషన్) పింఛన్లు పంపిణీ చేయాలి. ప్రతినెలా రూ.1,000 పింఛన్ అందేలా చూడాలి.ఆత్మగౌరవంతో జీవించేలా చేయాలని,ముస్లింల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడివుంది.వారిలో వెనుకబాటును దృష్టిలో ఉంచుకునే బడ్జెట్ ను నాలుగైదు రెట్లు అధికం చేసింది.రూ.1,100కోట్లతో ముస్లిం మైనారిటీలకు బడ్జెట్ పెట్టడం ఒక చరిత్ర,రికార్డు. ముస్లింలకు ఇచ్చిన అన్ని హామీలను అమలుచేశాం.మిగిలిన ఒకటో రెండో హామీలు ఏవైనా వుంటే వాటిని కూడా ఈ ఏడాదిలోపే నెరవేరుస్తామన్నారు.ఈ సమావేశంలో సీఎంవో కార్యదర్శి గిరిజా శంకర్,ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ శాఖ కార్యదర్శి కె.రాంగోపాల్, మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ ఎండి ఉషాకుమారి,నంద్యాల మైనారిటీ పెద్ద మౌలానా ముష్తాఖ్ అహ్మద్,ఎమ్మెల్సీ టిడి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts