తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ పురస్కరించుకొని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్లా జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఆయన పోలీసులచే గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అయిదవ వసంతంలోకి అడుగుపెట్టిందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాధనలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ఆయన జోహార్లు పలికారు.