YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తీవ్ర నష్లం మిగిల్చిన అకాల వర్షం

తీవ్ర నష్లం మిగిల్చిన అకాల వర్షం

మెదక్
ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులకు అకాల వర్షం తీవ్ర నష్టం మిగిల్చాయి. మంగళవారం నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. పిడుగుపాటుతో ఇద్దరు రైతులు, గాలి దుమారానికి గోడ కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట, మెదక్ జిల్లా మాసాయిపేటలో మార్కెట్ యార్డు, కల్లాల వద్ద వరి ధాన్యం తడిచి ముద్దయ్యాయి. భారీ వర్షం రావడంతో వరదలకు పలు చోట్ల కొట్టుకుపోయాయి. చెల్లాచెదురైన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు కష్టాలు పడ్డారు. సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో ఈదురు గాలులకు మామిడి నేలరాలాయి.  భారీ వృక్షాలుపడిపోయాయి. గాలివానకి మెదక్ జిల్లా కౌడిపల్లి (మం)  రాయిలపూర్ నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లిలో బావి వద్దకు వెళ్తుండగా పిడుగుపడి మల్లేశం(33) అనే రైతు, సంగారెడ్డి జిల్లా ఆందోల్ (మం) ఎర్రారం గ్రామ శివారులో పిడుగుపడి మరో రైతు మృతి చెందారు.

Related Posts