YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రజ్వల్ రేవన్న వేల మంది మహిళల ను బలత్కారం చేశారు

ప్రజ్వల్ రేవన్న వేల మంది మహిళల ను బలత్కారం చేశారు

హైదరాబాద్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా కోసం మహాలక్ష్మి 500 రూపాయలకు గ్యాస్, ఆరు గ్యారెంటీ స్కీములు అమలు చేస్తున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళాభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఏఐసిసి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబ అన్నారు. గురువారం ఆమె గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. మహిళా సాధికారత కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పాంచ్ న్యాయ ,పచ్చీసు గ్యారంటీలను అమలు చేస్తుంది. మోడీ పరివార్ లో నేరస్తులే ఉన్నారు. మోడీ పరివార్లు అంతా అదాని ,అంబానీ దేశ సంపదను దోచుకున్నారు. ప్రజ్వల్ రేవన్న వేల మంది మహిళల ను బలత్కారం చేశారు. వారి వీడియోలను చిత్రీకరించడం సిగ్గుచేటు. ప్రజ్వల్ రేవన్న కోసం ప్రధాని మోడీ ప్రచారం చేయడం దుర్మార్గమైన చర్య. మహిళా క్రీడాకారులను లైంగికంగా వేధించిన బ్రిజ్ భూషణ్ కుటుంబానికి లోక్ సభ సీటును బిజెపి ఇచ్చింది. అటువంటి వారికి బిజెపి సీట్లు కేటాయించింది. దీన్ని మహిళల లు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్న.దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది.  బిజెపి ఆర్ఎస్ఎస్ మహిళలను వంటింటికే పరిమిత చేయాలని ప్రయత్నాలు చేస్తుంది.  రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తివేయాలని కుట్ర చేస్తుంది.  తెలంగాణ మహిళలు చైతన్యవంతులు. వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే మహిళలకు రక్షణ కావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు.

Related Posts