YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

నూతన కెమెరా టెక్నాలజీ తో "అమర్ అక్బర్ అంథోని"

నూతన కెమెరా టెక్నాలజీ తో "అమర్ అక్బర్ అంథోని"
రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం దర్శకుడు శ్రీనువైట్ల సరికొత్త టెక్నాలజీలను వినియోగిస్తున్నారు. అమెరికాలోని విభిన్న వాతావరణ పరిస్థితుల్లో షూటింగ్‌ చెయ్యడం కోసం ఈ టెక్నాలజీ వాడుతున్నారు.
అమర్ అక్బర్ అంథోని చిత్ర షూటింగ్ మొత్తం అమెరికాలో జరుపుకోనుంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ యు.ఎస్ లో పూర్తి అయ్యడం జరిగింది. ఈ సినిమాకు రెడ్ మాన్‌స్ట్రో కెమెరా, జీస్ సుప్రీమ్ లెన్సెస్‌ల‌ని ఉప‌యోగిస్తున్నారు. తెలుగులో 8కే రెజెల్యూష‌న్ కెమెరాతో రూపొందుతున్న మొదటి సినిమా "అమర్ అక్బర్ అంథోని". ఈ టెక్నాలజీతో ప్రేక్షకులు కొత్త అనుభూతిని పొందుతారు. మైత్రి మూవీస్ మేకర్స్ సంస్థ నిర్మించబోతున్న ఈ మూవీలో రవితేజ సరసన ఇలియానా హీరోయిన్ గా నటిస్తోంది. సునీల్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.
నటీనటులు:
రవితేజ, ఇలియానా, సునీల్, లయ, అభిమన్యు సింగ్, తరుణ్ అరోరా, విక్రమ్ జీత్ సింగ్, షియాజి షిండే, ఆదిత్య మీనన్, వెన్నెల కిషోర్, సత్య, జయప్రకాష్ రెడ్డి, షకలక శంకర్ మరియు శుభలేఖ సుధాకర్.

Related Posts