YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

భారీ మెజార్టీతో రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలి

భారీ మెజార్టీతో రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలి

మేడ్చల్
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో మల్కాజిగిరి పార్లమెంటు అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్ లో  మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గోన్నారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ బోడుప్పల్ లో 10 సంవత్సరాల క్రితం నీళ్లు ఉండేవి కాదు... కెసిఆర్ ప్రభుత్వం వచ్చాక బోడుప్పల్ కి మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీరు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీటి కష్టాలు, కరెంటు కష్టాలు మొదలయ్యాయి. తెలంగాణలో మళ్లీ కెసిఆర్ కి మంచి అవకాశం వచ్చింది...  ఈ పార్లమెంట్ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మల్లారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి బీఆర్ఎస్ శ్రేణులను ఉత్సాహపరిచారు. ఈ కార్నర్ మీటింగ్ లో బొడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మిరవి గౌడ్, కార్పొరేటర్లు, భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు...

Related Posts