YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏడు కోట్ల నగదు స్వాధీనం

ఏడు కోట్ల నగదు స్వాధీనం

కాకినాడ
తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద లారీ ఢీకొట్టడంతో టాటా ఏస్ వాహనం బోల్తా పడింది. ఆ వాహనంలో తవుడు బస్తాల మధ్య 7 అట్టపెట్టెల్లో నగదు పెట్టి తరలిస్తున్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టుబడిన మొత్తం సుమారు రూ.7కోట్లుగా సమాచారం. వాహనం విజయవాడ నుంచి విశాఖ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బోల్తాపడిన టాటా ఏస్ వాహన డ్రైవర్కు గాయాలు కావడంతో అతడిని గోపాలపురం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Related Posts