రంగారెడ్డి
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే నిజమైన దేశ భక్తులన్నారు కొండా సంగీతారెడ్డి. ఈరోజు ఉదయం ఆమె రాజేంద్రనగర్ నియోజకవర్గంలోపర్యటించారు.నార్సింగిలోని గేటెడ్ కమ్యూనిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురుబీజేపీలో చేరారు. వారికి కొండా సంగీతారెడ్డి కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆమెమాట్లాడుతూ..నరేంద్ మోదీ,చతురత,సాహసోపేతనిర్ణయాలతో ఇవాళ భారతదేశంలో ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందన్నారు. మరోసారి ప్రజలంతా మోదీ సర్కారు ఏర్పాటుకు కృషి చేసి దేశాభివృద్ధిని కొనసాగించడంలో భాగం కావాలన్నారు. కొండావిశ్వేశ్వర్ రెడ్డిని బీజేపీ నాయకులు, కార్యకర్తల బలంతోవిజయంసాదించబోతున్నారని, ఆయనగెలిచిన వెంటనేకార్యకర్తలకు మంచి సంక్షేమపథకాలనుఅందిస్తారని సంగీతారెడ్డి చెప్పారు. ఈకార్యక్రమంలోరాజేంద్రనగర్నియోజకవర్గ బీజేపీముఖ్యనాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు పాల్గొన్నారు.