కమాన్ పూర్
ద్దపల్లి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ముస్త్యాల తాజా మాజీ సర్పంచ్ రామగిరి లావణ్య నాగరాజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ఘనంగా సన్మానించారు.
మంథని నియోజకవర్గంలోని కాటారం మండలంలోని ధన్వాడలో జరుగుతున్న శ్రీ దత్తాత్రేయ శివపార్వతి గణపతి ఆదిత్య నందికేశ్వర భక్తాంజనేయ ఆలయ మూడవ వార్షికోత్సవానికి వెళ్తున్న సందర్భంగా గుండారం గ్రామం వద్ద స్వాగతం పలికి శాల తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ కాంగ్రెస్ నేత దుద్దిల్ల శీను బాబు కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు తోపాటు పెన్ రెడ్డి కిషన్ రెడ్డి ఆకుల ఓదెలు ఐలి వెంకటేష్ పటేల్ పాల్గొన్నారు.